పోలీసు శాఖలో కిందిస్థాయి అధికారి, పైస్థాయి అధికారికి సెల్యూట్ చేయడం మామూలే. కాని ఇక్కడ కూతురుకు, తండ్రి సెల్యూట్ చేశాడు. కూతురు డిఎస్పీ కాగా, తండ్రి సిఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి ఇగ్నైట్ పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2018 బ్యాచ్కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో “దిశ” విభాగంలో జెస్సి ప్రశాంతి భాద్యతలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కళ్యాణి డ్యామ్లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్యాంసుందర్ పని చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ తండ్రి శ్యామ్ మురిసిపోయారు. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు. తను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్నా అంటూ గట్టిగా నవ్వేశారు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు, నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు సిఐ శామ్ నుందర్. పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటాం కాని తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా గర్వంగా ఉందంటూ ప్రశాంతికి ఆల్ ది బెస్ట్ అంటూ అభినందించారు.