చాలామంది స్వలింగ సంపర్కులు పురుషులు, మహిళగా మారిపోతున్నారు. సమాజంలో మారుతున్న పరిస్థితులను బట్టి ఎవరి ఆలోచనపరంగా వారు వ్యవహరిస్తున్నారు. స్వలింగసంపర్కులు కూడా హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే అమ్మాయిలా మారారు. తన పేరును సైషాగా మార్చుకొన్నారు. ఇన్ని రోజులు పురుషుడిగా ఉన్న తను ఎలా అమ్మాయిగా మారాడో, ఎందుకు మారాడో ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. తనలోని హార్మోన్ల లోపం వల్ల చిన్నప్పటి నుంచి సమాజంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని, స్కూల్, కాలేజీ రోజుల్లో తోటి విద్యార్థులు తనను మానసికంగా హింసించేవారని గుర్తుచేసుకుంటూ బాధపడ్డారు. తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయేదానిని అని, అప్పుడు 20 సంవత్సరాల వయస్సులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో చేరాక నిజాన్ని జీర్ణించుకోవడం మొదలు పెట్టానని తెలిపారు. చిన్నప్పటి నుంచే నేను పురుషుల పట్ల ఆకర్షితురాలినయ్యేదాన్ని అప్పుడు నేను ‘గే’ అనుకొన్నాను. కానీ నేను మహిళను అని ఆరేండ్ల క్రితమే నాకు స్పష్టత వచ్చిందని చెప్పారు. సైషా అంటే అర్థవంతమైన జీవితం అని పేర్కొన్నారు. స్వప్నిల్ షిండే దీపికా పదుకొనే, కరీనా కపూర్, శ్రద్ధా కపూర్, తాప్సీ తదితరులతో కలిసి పనిచేశారు.