
జైలు సిబ్బందితో నమ్మకంగా ఉంటూ, ఒకేసారి హఠాత్తుగా జైలు సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి 16మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఫలోడి జైలులో సినీఫక్కీలో మాదిరిగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర జైళ్ల శాఖ చర్యలకు ఉపక్రమించింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నలుగురు అధికారులతో పాటు ఒక కానిస్టేబుల్ను మంగళవారం విధులను నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనను తీవ్రమైన చర్యగా పేర్కొంటూ డిపార్ట్మెంట్ దీనికి బాధ్యత వహిస్తుందని జైళ్ల శాఖ డీజీ రాజీవ్ దాసోత్ తెలిపారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, ఎస్పీతో సంప్రదింపులు జరిపి గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ మేరకు జోధ్పూర్, బికనేర్ సరిహద్దులను మూసివేశామన్నారు. తప్పించుకున్న ఖైదీలను సుఖ్దేవ్, జగదీశ్, షోకత్ అలీ, అశోక్, ప్రేమ్, అనిల్, ప్రదీప్, రాజ్కుమార్, మోహన్, శరవన్, ముకేశ్, శివ ప్రతాప్, శంకర్, హనుమన్, మహేంద్రగా గుర్తించినట్టు తెలిపారు.