
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు చైనాలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ను అరికట్టేందుకు చైనా కేసులు ఎక్కువగా ఉన్న నగరాల్లో లాక్డౌన్ విధిస్తోంది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్డౌన్ విధించగా ఇప్పుడు సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్లోని అన్యాంగ్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించిన అనంతరం లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అన్యాంగ్ నగరంలోని ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు సూచించారు. నగరవాసుల వాహనాల వినియోగాన్ని నిషేధించారు. సోమవారం ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకగా, మంగళవారం మరో 58 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.