
యాత్రికులతో వెళుతున్న ఒక మినీ బస్సు అదుపుతప్పి చెట్టుకు కొట్టింది.. ఈ ఘోర ప్రమాదంలో 10మంది యాత్రికులు మరణించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మొత్తం 18 మంది హరిద్వార్లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.