
మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47మంది అభ్యర్ధులు ఉన్నారు. ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు నేటితో ముగిసింది. అక్టోబరు 7వ తేదీన ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాగా.. అక్టోబరు 14న నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 83 మంది అభ్యర్థు్ల్లో 36 మంది ఇవాళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 47మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.