
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రతకు ఇంట్లోని వస్తువులు కదిలిన దృశ్యాలను ఢిల్లీ వాసులు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకంపనల ధాటికి ఫ్యాన్లు, షాండ్లియర్ ఊగుతున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఢిల్లీ భూమి కంపించడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఈ మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో నేపాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని పితోరగఢ్కు 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటివరకు సమాచారం లేదు.