
జగన్ కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ కోర్టులో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది.
విశాఖపట్నం ఎయిర్పోర్టులో జరిగిన ఈ ఘటనతో అక్కడి రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్కు సంబంధం లేదని కౌంటర్లో ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తెదేపా సానుభూతిపరుడు కాదని స్పష్టం చేసింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని.. జగన్ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోర్టుకు ఎన్ఐఏ విజ్ఞప్తి చేసింది. మరోవైపు వాదనలకు సమయం కావాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.