
నలుగురు అన్నదమ్ములు బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు నలుగురి ప్రాణాలను కబళించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లివాసులు కృష్ణ, సంజీవ్, సురేశ్, వాసుగా గుర్తించారు. సూరత్లో నివాసం ఉంటున్న వీరు.. స్వగ్రామంలోని బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.