
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఇకపై మిగ్-21 విమానాలు వాడకూడదని ఇండియన్ ఎయిర్ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. మిగ్-21 యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళం చెకింగులు నిర్వహించబడే దాకా మిగ్-21 యుద్ధ విమానాల మొత్తం విమానాలను నిలిపివేసింది. ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ మీదుగా వెళ్లే యుద్ధ విమానం క్రాష్ వెనుక కారణాలపై పరిశోధనలు కూడా జరిగాయి. మే 8 వ తేదీన సూరత్గఢ్ ఎయిర్ బేస్ నుంచి మిగ్-21 బైసన్ ఎయిర్క్రాఫ్ట్ విమానం హనుమాన్గఢ్ మీదుగా ఒక గ్రామంలో కూలిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే పూర్తి విచారణ నిర్వహించి కూలిపోవడానికి గల కారణాలను నిర్ధారించనున్నట్లు సీనియర్ రక్షణ అధికారులు తెలిపడం జరిగింది. మిగ్-21 బైసన్ విమానం ప్రమాద ఘటనపై దర్యాప్తు పూర్తయి ప్రమాదానికి గల కారణాలు తెలిసే దాకా ఈ మిగ్-21 విమానాలను నిలిపివేసినట్లు రక్షణ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.