త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు బ్యాంక్ లోన్ తీసుకుంటే..

Share On

పేద‌రికం.. త‌ల్లి మర‌ణించింది.. అంత్య‌క్రియ‌లు చేసేందుకు డ‌బ్బులు లేక బ్యాంకులో లోన్ తీసుకున్నారు. లోన్ ఇచ్చిన బ్యాంకు వేధింపులు భ‌రించ‌లేక చివరికి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. పటాన్‌చెరువు మండలం రుద్రారం గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్.. తోషిబా పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆరు నెలల క్రితం తన తల్లి మరణించింది. ఎంతో ప్రేమగా చూసుకున్న తన తల్లి మరణించటంతో.. శ్రీనివాస్ కుంగిపోయాడు. తనకు వచ్చే జీతంతో కుటుంబం గడవటమే కష్టంగా ఉంటే.. తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులిచ్చే వ్యక్తులు ఎవ‌రూ లేకపోవటంతో.. బ్యాంకులో లోన్ తీసుకుని నెల నెలా కట్టుకుందామ‌ని బ్యాంకు సిబ్బందికి ఫోన్ చేశాడు. లోన్ కావాలనగానే వెంటనే స్పందించే బ్యాంకు సిబ్బంది.. వెంటనే డబ్బు ఇచ్చారు.

బ్యాంక్ లోన్‌తో వచ్చిన డబ్బుతో.. తల్లి అంత్య క్రియలను శ్రీనివాస్ భారీగానే నిర్వహించాడు. తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లి ఒక్కసారిగా తనను విడిచి వెళ్లిపోవటమే తనను కుంగదీసింది. ఈ బాధలో.. పని కూడా సరిగా చేయకపోవటంతో డబ్బులు రావటం తగ్గింది. ఇటు కుటుంబం గడవటం… అటు లోన్ ఈఎంఐలు కట్టటం చాలా కష్టంగా మారింది. దీంతో.. రెండు నెలలుగా ఈఏంఐలు కట్టలేదు. దీంతో.. బ్యాంక్ రికవరీ సిబ్బంది.. రంగంలోకి దిగారు. వాళ్లకు మనుషులు మనోభావాలు, కష్టాలు, భావోద్వేగాలతో సంబంధం ఉండదు కనుక.. వాళ్ల స్టైల్‌లో బెదిరిస్తూ… వేధింపులు మొదలుపెట్టారు. డబ్బులు కట్టకపోతే.. బంధువులు, స్నేహితులందరికి ఈ విషయం చెప్పి.. పరువు తీస్తామంటూ ఫోన్లు చేసి టార్చర్ చేశారు.

అటు అమ్మ పోయిన బాధ, ఇటు ఆర్థిక ఇబ్బందులు, మీది నుంచి ఈ వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్.. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బలవన్మరణం చెందాడు. దీంతో.. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడింది. రికవరీ ఎజెంట్ల వేధింపుల వల్లే తన భర్త సూసైడ్ చేసుకున్నాడంటూ శ్రీనివాస్ భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu