ఆఫీసులో దుష్టశక్తులు ఉన్నాయంటూ మత ప్రార్థనలు

Share On

కేరళ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించాడు ఒక ప్రభుత్వ అధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌ చిన్నారుల సంరక్షణ కార్యాలయంలో జరిగింది. దీనిపై దర్యాప్తు చేయాలని సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించినట్లు కలెక్టర్‌ కృష్ణతేజ తెలిపారు. గత నెలలో కార్యాలయంలోని ఉద్యోగులందరినీ అత్యవసర సమావేశం కావాలని ఆదేశించిన ఓ అధికారి.. బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్థన చేపట్టారు. కార్యాలయంలో దుష్టశక్తులు ఉన్నాయని.. వాటిని తొలగించాలని ప్రార్థనలు చేయాలని ఉద్యోగులకు సూచించాడు. అంతా ఒప్పంద ఉద్యోగులు కావడం వల్ల ఎవరూ నోరు మెదపలేదు. ఈ వ్యవహారం కలెక్టర్‌ దృష్టికి రావడంతో ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ కృష్ణతేజ ఈనెల 11న సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించారు.

కార్యాలయం నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి ప్రార్థన చేసినందుకు కేరళ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేశారు. తన మాట వినకుండా, ఘటనకు సంబంధించి ఆయన ఇచ్చిన వివరణలపై స్పందించకుండానే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. జిల్లా కలెక్టర్ కృష్ణతేజ నవంబర్ 11న ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సబ్‌కలెక్టర్‌ను ఆదేశించడంతో సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలువడ్డాయి. సంఘటన జరిగిన రోజు అదే కార్యాలయంలోని ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అధికారిక క్రైస్తవ దుస్తులు ధరించి, ఆ కార్యాలయ అధిపతి సూచనల మేరకు ప్రార్థనలు చేసినట్లు నివేదించబడింది. ఈ ఘటనపై మీడియా ద్వారా సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu